న్యూఢిల్లీ: భారత డబుల్స్ ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ తొలిసారి టాప్-100లో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన టాటా ఓపెన్ మహారాష్ట్ర చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ నెగ్గిన రోహన్ బోపన్న-రామ్కుమార్ జోడీ ర్యాంకింగ్స్లోను దూసుకెళ్లింది. రెండో ఏటీపీ టైటిల్ను ఖాతాలో వేసుకున్న రామ్కుమార్ కెరీర్ బెస్ట్ 94వ స్థానానికి చేరగా.. అతడి సహచరుడు, వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న ఎనిమిది స్థానాలు ఎగబాకి 35 ర్యాంక్లో నిలిచాడు. డబుల్స్ టాప్-100 భారత్ నుంచి 41 ఏండ్ల బోపన్న, 27 ఏండ్ల రామ్కుమార్ మాత్రమే చోటు దక్కించుకోగలిగారు. దివిజ్ శరణ్ 134వ స్థానంలో ఉండగా.. సింగిల్స్లో దేశం తరఫున అత్యుత్తమంగా రామ్కుమార్ 185వ స్థానంలో కొనసాగుతున్నాడు. సుమిత్ నాగల్ (217), ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (235), ముకుంద్ శశికుమార్ (334) ఆ తర్వాతి ప్లేస్ల్లో ఉన్నారు.