హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాలక వర్గ సభ్యులందరం ఒకతాటిపై కలిసి పనిచేస్తామని అధ్యక్షుడు జగన్మోహన్రావు అన్నారు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. జగన్తో పాటు దల్జిత్సింగ్ (ఉపాధ్యక్షుడు), దేవరాజ్ (కార్యదర్శి), బసవరాజు(సహాయ కార్యదర్శి), శ్రీనివాస్రావు (కోశాధికారి), సునీల్ (కౌన్సిలర్)పదవులను అలకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ ‘అనుభవజ్ఞులైన శివలాల్, అర్షద్, జాన్మనోజ్ అభిప్రాయలకు తోడు క్లబ్ కార్యదర్శుల ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తాం. క్రికెట్ అభివృద్ధికి ఆయా క్లబ్లు, జిల్లా అనుబంధ సంఘాల సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తాం’ అని అన్నారు.