కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను అమెరికా ఉపసంహరించుకోవడం ప్రారంభం కాగానే, ఇటు తాలిబాన్ ఉగ్రవాదులు తమ పరిధిని విస్తరించడం ప్రారంభించారు. కొన్ని వారాల వ్యవధిలోనే మూడు జిల్లాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తున్నది. సెప్టెంబర్ 11 నాటికి అమెరికా, నాటో దళాలు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత పరిస్థితులను ఊహించుకుంటూ స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నట్లుగా తెలుస్తున్నది.
స్థానిక మీడియా ప్రకారం, తాలిబాన్ ఉగ్రవాదులు ఇటీవల వరదక్ ప్రావిన్స్లోని జల్రేజ్ జిల్లాను, లాగ్మాన్ ప్రావిన్స్లోని దౌలత్ షా జిల్లాను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘన్ భద్రతా దళాలతో ఘర్షణల నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో బాగలాన్ ప్రావిన్స్లోని బుర్కా జిల్లాను కూడా ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. భద్రతా దళాలు ముందుకు సాగకుండా నిరోధించడానికి తాలిబాన్లు మిలిటెంట్ పౌరులను ఉపయోగిస్తున్నారని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రోహుల్లా అహ్మద్జాయ్ తెలిపారు. భద్రతా దళాలు జిల్లాల నుంచి ఉగ్రవాదులను త్వరలోనే తిప్పికొడతాయని ఆయన చెప్పారు. పౌరుల భద్రత దృష్ట్యా సమయం తీసుకుంటున్నామన్నారు.
ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాల నాటి సంఘర్షణను అంతం చేసే ప్రయత్నంలో గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-తాలిబాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలుగుతున్నాయి. సెప్టెంబర్ 11 నాటికి అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా వైదొలుగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత నెలలో ప్రకటించారు.
మయన్మార్లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
ఒలింపియన్ సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసిన రైల్వే
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..