న్యూఢిల్లీ: బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్కు ప్రధాని నరేంద్రమోదీ హృదయపూర్వక శ్రద్దాంజలి ఘటించారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం, మానవ హక్కుల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప మహనీయుడని ప్రధాని కొనియాడారు. షేక్ ముజిబుర్ రెహమాన్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ ప్రధాని మోదీ ఆయనను గుర్తుచేసుకున్నారు. ఆయన కేవలం బంగ్లాదేశీయులకేగాక భారతీయులందరికి కూడా హీరోనే అని ఆయన పేర్కొన్నారు. చారిత్రక ముజిబ్ బోర్షో ఉత్సవాల కోసం ఈ నెలాఖరులో తాను బంగ్లాదేశ్లో పర్యటించనుండటం షేక్ ముజిబుర్ రెహమాన్కు తాను ఇస్తున్న గౌరవమని ప్రధాని వ్యాఖ్యానించారు.