హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ): నీరు, జీవావరణంతోపాటు మానవశరీరంలో ఉండే ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాలో ఉన్న కొన్ని విష జన్యువులు కొలిటాగ్జిన్ను ఉత్పత్తి చేస్తున్నాయని, దాని కారణంగా పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని తెలిపారు. యూవోహెచ్ ప్రొఫెసర్ నియాజ్ అహ్మద్ నేతృత్వంలోని పరిశోధనా బృందం దాదాపు నాలుగువేల జీవకణాలపై పరిశోధన నిర్వహించిన ఈ విషయాన్ని గుర్తించింది. మనుషుల డీఎన్ఏను సైతం మార్చగలిగే కొలిటాగ్జిన్తో చాలామంది క్యాన్సర్ బారినపడినట్టు గుర్తించారు. మనదేశంలో 7 శాతం మంది ఈ-కొలి బ్యాక్టీరియా వల్ల క్యాన్సర్ బారినపడ్డారని, దీనిపై విసృ్తత పరిశోధన జరగాల్సి ఉన్నదని నియాజ్ అహ్మద్ తెలిపారు. జర్మనీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్, పుణెలోని డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠ్ సహకారంతో ఈ పరిశోధన నిర్వహించారు