REDMI 15 5G | షియోమీ కంపెనీ రెడ్మీ 15 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన లేటెస్ట్ షియోమీ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.9 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. అదనంగా మరో 8జీబీ వరకు ర్యామ్ను వర్చువల్గా పెంచుకునే వీలు కల్పించారు. ఈ ఫోన్కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో సెకండరీ కెమెరాను కూడా ఇచ్చారు.
ఈ ఫోన్కు ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత హైపర్ ఓఎస్ 2 ను అందిస్తున్నారు. ఈ ఫోన్కు 2 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ను, 4 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ ఫోన్కు ఇదే ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ను అందిస్తున్నారు. కనుక ఫోన్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది. 18 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్ కు కూడా సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల ఇతర ఫోన్లను సైతం దీని సహాయంతో చార్జింగ్ చేసుకోవచ్చు. 4 ఏళ్ల వరకు ఈ ఫోన్ను ఉపయోగించినప్పటికీ 80 శాతం వరకు బ్యాటరీ మన్నికగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ కూడా లభిస్తుంది. దీని వల్ల ఫోన్ను యూనివర్సల్ రిమోట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఐపీ 64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెన్స్ ఫీచర్ను దీనికి అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సర్టిఫికేషన్ ఉన్నందున సౌండ్ క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన ఆడియోను ఆస్వాదించవచ్చు.
ఈ ఫోన్లో 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలు కూడా ఉన్నాయి. రెడ్మీ 15 5జి స్మార్ట్ ఫోన్ను మిడ్ నైట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ బ్లాక్, శాండీ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్లను అమెజాన్తోపాటు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ స్టోర్స్, ఇతర రిటెయిల్ స్టోర్స్ లో ఆగస్టు 28 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్బంగా ఈ ఫోన్పై ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీ, ఎస్బీఐ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్పై రూ.1000 డిస్కౌంట్, రూ.1000 అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ను పొందవచ్చు. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.