Xiaomi 13 Pro | భారత్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ.. తన షియోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) ఫోన్ ఆవిష్కరణ తేదీ ప్రకటించింది. ఈ నెల 26న దేశీయ మార్కెట్లోకి `షియోమీ 13 ప్రో` రానున్నది. ఈ నెల 26 ఉదయం 9.30 గంటలకు భారత్ మార్కెట్లో లాంచ్ చేయనున్నది. షియోమీ ఇండియా సైట్, కంపెనీ ఇండియా ఫేస్బుక్, యూ-ట్యూబ్, ట్విట్టర్ ఖాతాల్లో లైవ్ స్ట్రీమ్ చేస్తారు. ఇప్పటికైతే భారత్ మార్కెట్లో ఎంత ధరకు విక్రయిస్తారన్న సమాచారం వెల్లడి కాలేదు. గత డిసెంబర్లోనే చైనా మార్కెట్లోకి వచ్చేసిన షియోమీ 13 ప్రో ధర దాదాపు రూ.61 వేలు (4,999 చైనా యువాన్లు)గా ఉండొచ్చునని భావిస్తున్నారు.
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్2 చిప్సెట్తో వస్తున్న నాలుగో ఫోన్ ఇది. ఐక్యూ 11 5జీ (iQoo 11 5G), వన్ ప్లస్ 11 5జీ (OnePlus 11 5G), శాంసంగ్ గెలాక్సీ (Samsung Galaxy) ఎస్23 సిరీస్ ఫోన్లు కూడా స్నాప్ డ్రాగన్ 8 జన్ 2 ఎస్వోసీ చిప్సెట్తోనే మార్కెట్లోకి వచ్చాయి. అధికారికంగా భారత మార్కెట్లోకి రానున్న షియోమీ 13 ప్రో ఫీచర్లు వెల్లడించకపోయినా.. చైనా మోడల్ ఫీచర్లు ఉండొచ్చునని భావిస్తున్నారు.