ఇది స్మార్ట్ ఫోన్ కాలం. స్మార్ట్ఫోన్ లేనిదే రోజు గడవదు. అందుకే స్మార్ట్ ఫోన్ సెల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్ అరచేతిలో ఉంటేనే మనం ఏపనైనా చేసేది. ఒక్క నిమిషం ఫోన్ కనిపించకపోతే.. రచ్చ రచ్చ చేస్తాం. అందుకే.. జనాల నాడిని పట్టిన స్మార్ట్ఫోన్ బ్రాండ్స్.. రోజురోజుకూ సరికొత్త ఫీచర్లతో మొబైల్స్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. బడ్జెట్ ధరలో కూడా అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
తాజాగా.. వివో బడ్జెట్ ఫోన్ను రిలీజ్ చేసింది. వై21 మోడల్ను ఇండియా మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్లో బెస్ట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. అలాగే.. ధర కూడా 20 వేల లోపే. వివో వై21 స్మార్టఫోన్ ధర రూ.15,490 గా ఉంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.51 ఇంచ్ హెచ్డీ ప్లస్ 1600 * 720 డిస్ప్లే, ఆండ్రాయిడ్ 11 ఆధారిత.. ఫన్టచ్ ఓస్ 11.1 ఓఎస్, మీడియాటెక్ హెలియో పీ35 చిప్ సెట్, 4 జీబీ రామ్ ప్లస్ 1 జీబీ ఎక్స్టెండెడ్ వర్చువల్ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్, 13 మెగాపిక్సెల్ రేర్ డ్యుయల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ షూటర్, ఫ్రంట్.. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0, వైఫై 2.4 జీహెచ్జెడ్, 5 జీహెచ్జెడ్, 18 వాట్స్ చార్జింగ్ లాంటి ఫీచర్స్ ఈ ఫోన్తో లభిస్తాయి. ఈ ఫోన్ రెండు కలర్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మిడ్నైట్ బ్లూ, డైమాండ్ గ్లో కలర్స్లో లభిస్తుంది. సెప్టెంబర్ 30 లోపు ఈ ఫోన్ను బుక్ చేసుకుంటే.. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో 500 రూపాయల క్యాష్బ్యాక్ లభిస్తుంది.