న్యూఢిల్లీ : భారత్లో వివో ఎక్స్80 లాంఛ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. మే 18న భారత్లో వివో న్యూ ఎక్స్80 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ లాంఛ్ చేస్తోంది. భారత్లో వివో ఎక్స్80 ప్రొ లాంఛ్ను టీజర్ ద్వారా నిర్ధారించారు. చైనా, మలేషియాల్లో తొలుత ఈ రెండు స్మార్ట్ఫోన్లు లాంఛ్ కానున్నాయి.
వివో ఎక్స్80 ప్రొ ఈ సిరీస్లో ఫ్లాగ్షిప్ ఫోన్గా కస్టమర్ల ముందుకు రానుంది. ఇక ఎక్స్80 ప్రొప్లస్ను రాబోయే రోజుల్లో లాంఛ్ చేస్తుందా లేదా అనే విషయాన్ని వివో వెల్లడించలేదు. వివో ఎక్స్80 ప్రొ, వివో ఎక్స్80 స్మార్ట్ఫోన్లు 6.78 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లేను కలిగిఉంటాయి. వివో ఎక్స్80 ఫుల్హెచ్డీ డిస్ప్లేతో ముందుకొస్తోంది.
రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 12 అవుటాఫ్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతాయి. ఎక్స్80 ప్రొ 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉండగా, ఎక్స్80 4500ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంది. రెండు స్మార్ట్ఫోన్లు 80డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్ను కలిగిఉండగా ఎక్స్80 ప్రొ 50వాట్స్ వైర్లెస్ చార్జింగ్తో కస్టమర్ల ముందుకు రానుంది.