vivo X200 FE | చాలా వరకు కంపెనీలు ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఉండే ఫీచర్లను మిడ్ రేంజ్ ఫోన్లలో అందిస్తున్నాయి. శాంసంగ్ వంటి పెద్ద కంపెనీలకు పోటీగా ఫ్లాగ్ షిప్ ఫోన్లను అత్యంత తక్కువ ధరకే అందిస్తున్నాయి. అందులో భాగంగానే వివో కూడా లేటెస్ట్గా ఓ నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. వివో ఎక్స్200 ఎఫ్ఈ పేరిట లాంచ్ అయిన ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.31 ఇంచుల 1.5కె ఎల్టీపీఓ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను కూడా అందిస్తున్నారు. అందువల్ల డివైస్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్కు గాను ఐపీ69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ను అందిస్తున్నారు. 16జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. 50 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాను కూడా వెనుక వైపు ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 6500 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ను చాలా వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ను 12జీబీ, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది.
డ్యుయల్ సిమ్లను వేసుకోవచ్చు. ముందు వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఈ ఫోన్లో సపోర్ట్ లభిస్తుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా ఉంది. వైఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లను సైతం అందిస్తున్నారు.
వివో ఎక్స్200 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ను లక్స్ గ్రే, ఫ్రాస్ట్ బ్లూ, ఆంబర్ ఎల్లో కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.54,999 ఉండగా, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.59,999గా ఉంది. ఈ ఫోన్ను వివో ఇండియా ఆన్లైన్ స్టోర్తోపాటు ఫ్లిప్కార్ట్, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్లో జూలై 23వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్కు గాను ఇప్పటికే ప్రీ బుకింగ్స్ను ప్రారంభించారు. ఈ ఫోన్ను వినియోగదారులు జీరో డౌన్ పేమెంట్తో కొనుగోలు చేసే సదుపాయం అందిస్తున్నారు. 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్, డీబీఎస్, హెచ్ఎస్బీసీ, యెస్ బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్ను కొంటే 10 శాతం ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ ఫోన్ను కొనుగోలు చేసిన వారు రూ.1499కే వివో ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ను పొందవచ్చు.