Vivo V27 Series | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో వచ్చే నెలలో భారత్ మార్కెట్లో వివో వీ27 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించనున్నది. ఆవిష్కరణ తేదీ వెల్లడి కాలేదు. వివో వీ25 సిరీస్కు కొనసాగింపుగా రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్లను వివో ఆవిష్కరించనున్నది. వివో వీ27, వివో వీ27 ప్రో పేరిట భారత్ మార్కెట్లోకి రానున్నాయి. ఫ్లిప్కార్ట్, వివో ఈ-స్టోర్ల్లోనూ, ఆఫ్లైన్ స్టోర్లలోనూ వివో వీ27 సిరీస్ ఫోన్లు లభ్యం కానున్నాయని తెలుస్తున్నది.
మీడియా కథనాల ప్రకారం వివో వీ27 5జీ సిరీస్ ఫోన్ ధర రూ.35 వేలు, వివో వీ27 ప్రో ఫోన్ ధర రూ.40 వేలు ఉండొచ్చునని అంచనా. వివో వీ27 సిరీస్లో వీ27 4జీ, వీ27 5జీ, వీ27 ప్రో 5జీ, వీ 27ఈ 5జీ ఫోన్లు ఆవిష్కరించనున్నట్లు సమాచారం. త్వరలో ఆవిష్కరణ తేదీని వివో వెల్లడిస్తుందని తెలుస్తున్నది.