Twitter M-Cap | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 402 కోట్ల డాలర్లు దాటింది. సోమవారం సంస్థ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలగనున్నారన్న వార్తల నేపథ్యంలో ప్రారంభంలో ఇంట్రా డే ట్రేడింగ్లో ట్విటర్ షేర్ జూమ్మంటూ 11 శాతానికి అంటే 52.27 డాలర్లకు దూసుకెళ్లింది.
ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగే విషయమై వార్తను ఆ సంస్థ పెండింగ్లో పెట్టడంతో స్టాక్ ఎక్స్చేంజ్ల నిర్వాహకులు తాత్కాలికంగా ట్రేడింగ్ నిలిపేశారు. 2006లో ట్విట్టర్ను జాక్ డోర్సీ స్థాపించారు. ట్విట్టర్ అటుపై ఆయనను బిలియనీర్గా మార్చేసింది. ట్విట్టర్తోపాటు సొంతంగా ఏర్పాటు చేసుకున్న పేమెంట్స్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ కంపెనీ.. స్క్వేర్ ఇంక్కు కూడా జాక్ డోర్సీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
గతేడాది ప్రారంభం నుంచి ఎల్లియంట్ మేనేజ్మెంట్.. సీఈవోగా జాక్ డోర్సీ స్థానంలో మరొకరిని నియమించాలని ట్విట్టర్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చింది. డోర్సీ రెండు సంస్థలకు సారధ్యం వహించాలనుకుంటే ఒక సంస్థ సీఈవోగా వైదొలగాలని ఎల్లియంట్ మేనేజ్మెంట్ ఫౌండర్, బిలియనీర్ ఇన్వెస్టర్ పాల్ సింగర్ సూచించారు.