Sundar Pichai | సెర్చింజన్ గూగుల్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన `గూగుల్ ఎనిమిదవ ఎడిషన్`లో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ మాట్లాడుతూ `గూగుల్ పే`లో వాయిస్ ద్వారా`ట్రాన్సాక్షన్ సెర్చ్` ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. యూజర్ల కోసం డిజిలాకర్ వసతి తీసుకొస్తామని తెలిపారు. భారత్లో యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవలను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తీసుకురానున్నట్లు వెల్లడించారు. వేలాది భాషల్లో సమాచారం పొందేందుకు శక్తిమంతమైన కృత్రిమ మేధ (ఏఐ) మోడల్ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు.
కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రంగాల్లో గణనీయ మార్పులు రానున్నాయని చెప్పారు. వాటిల్లో వ్యవసాయ రంగం ఒకటి, భాషల మధ్య వ్యత్యాసం, రుణ వసతి కల్పన తదితర రంగాలతో మార్పులు తేనున్నదన్నారు. తద్వారా దిగువ శ్రేణి వర్గాల ప్రజలను అభివృద్ధి బాట పట్టించడానికి వీలు చిక్కుతుందని తెలిపారు.
గూగుల్ ఇండియా ఎనిమిదో సదస్సులో పాల్గొన్న తర్వాత సుందర్ పిచ్చాయ్.. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రదాని మోదీతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. `మీ నాయకత్వంలో టెక్నాలజీ పరంగా శరవేగంగా మార్పులు రావడం స్ఫూర్తిదాయకం. ఈ రోజు మీతో జరిగిన భేటీ అద్భుతం. అందుకు మీకు ధన్యవాదాలు.జీ-20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్కు మద్దతు తెలిపేందుకు సుముఖంగా ఉన్నామని సుందర్ పిచ్చాయ్ తెలిపారు.