Tomato | లక్నో, ఆగస్టు 20: టమాటాను 5 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉండేట్టు చేయటంలో తమ పరిశోధనలు సఫలీకృతమయ్యాయని లక్నోలోని ‘సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐ’ (నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) సంస్థ తాజాగా వెల్లడించింది. టమాటా..పండుగా మారే కాలాన్ని పెంచవచ్చునని సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐ చీఫ్ సైంటిస్టు అనిరుధా సేనీ తెలిపారు. సుదూర పా్రంతాల నుంచి టమాటా రవాణా సులభతరమవుతుందని, భవిష్యత్తులో వీటి ధరల్ని నియంత్రించవచ్చునని చెప్పారు.
పంట కోత అయ్యాక మూడు రోజుల్లోగా టమాటాను మార్కెట్కు తరలించాల్సి వుంటుంది. లేదంటే పండువండి కుళ్లిపోతాయి. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. మరోవైపు అధిక ధరలతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ఈ పరిస్థితిని మార్చేందుకు తమ పరిశోధన దోహదపడుతుందని అనురుధా సేనీ చెబుతున్నారు. వేర్హౌస్ల్లో నిల్వ చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘టమాటా పండుగా మారేందుకు దోహదపడేది ‘అబ్సెసిక్ ఆమ్లం’. జన్యుపరమైన మార్పులతో ఈ ఎంజైమ్ను తగ్గించగలిగాం. దీంతో ఎథిలిన్ విడుదల ఆలస్యమై..పండుగా మారే ప్రక్రియ నెమ్మదించింది’ అని ఎన్బీఆర్ఐ డైరెక్టర్ అజిత్ కుమార్ వివరించారు.