చాలామందికి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలని ఉంటుంది. దానికి కారణం.. జీతం ఎక్కువ, సమాజంలో ఒక స్థాయి.. వారానికి 5 రోజుల పని ఉంటాయని అటువైపు మళ్లుతుంటారు. అలాగే మరికొందరికి ఐటీ దిగ్గజ సంస్థలలో పనిచేయాలని ఉంటుంది.
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి సంస్థలలో పనిచేయాలని ఎవరి ఉండదు చెప్పండి. కానీ.. ఈ టెకీ మాత్రం పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేయడం మాత్రమే తన టార్గెట్గా పెట్టుకోలేదు. ఏకంగా ఆయా కంపెనీలలో ఉన్ ఎర్రర్స్, బగ్స్ను టార్గెట్ చేశాడు. వాటిని కనిపెట్టి కంపెనీల దృష్టిలో పడి.. కోట్లు సంపాదిస్తున్నాడు. అతడే అమన్ పాండే.
ఇటీవలే గూగుల్ నుంచి అమన్ పాండే రూ.65 కోట్లు అందుకున్నాడు. ఎందుకో తెలుసా.. గూగుల్ వల్నరబిలిటీ రివార్డ్స్ ప్రోగ్రామ్(వీఆర్పీ) రీసెర్చర్స్లో తను టాప్లో నిలిచాడు. గూగుల్కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్లో ఉన్న 232 బగ్స్ను గూగుల్కు సబ్మిట్ చేశాడు. అలాగే.. 280 వాలిడ్ ప్రాబ్లమ్స్ను గూగుల్కు అందించాడు. అప్పటి నుంచి అమన్ రీసెర్చర్గా పనిచేస్తున్నాడు.
ఎన్ఐటీ భోపాల్లో బీటెక్ చదివిన అమన్ పాండే.. మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, జావా, ప్రాడక్ట్ డెవలప్మెంట్ లాంటి టెక్నాలజీలలో ట్రెయినింగ్ పొందాడు. ఆ తర్వాత గూగుల్లో ఉన్న బగ్స్ను ఐడెంటిఫై చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఆండ్రాయిడ్, గూగుల్ క్రోమ్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూలను కనిపెట్టడంలో గూగుల్కు హెల్ప్ చేశాడు అమన్.