న్యూఢిల్లీ : భారత్లో శాంసంగ్ లాంఛ్ చేసిన నాలుగో తరం ఫోల్డబుల్స్కు అద్భుత స్పందన లభిస్తోంది. 12 గంటల్లోపే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్4, గెలాక్సీ ప్లిఫ్4కు 50,000కు పైగా ప్రీ బుకింగ్స్ వచ్చాయని శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ సేల్స్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ చెప్పారు. ఆగస్ట్ 16న ఫోల్డబుల్స్ ప్రీ బుకింగ్ ఓపెన్ అయిన తొలిరోజు రికార్డు బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ ఏడాది ఒకటిన్నర రెట్లు అధికంగా ఫోల్డ్బుల్ పోన్లు విక్రయించాలని శాంసంగ్ లక్ష్యంగా నిర్ధేశించుకుంది.
గత ఏడాదితో పోలిస్తే ఫోల్డబుల్ ఫోన్లు భారీ అప్డేట్స్తో ముందుకు రావడంతో టార్గెట్ను సులభంగా అధిగమిస్తామని పుల్లన్ చెప్పుకొచ్చారు. భారత్లో ఈసారి ఫోల్డ్బుక్ ఎక్స్పీరియన్స్ విస్తరణకు కంపెనీ వ్యూహాత్మక ఎత్తగడలు ప్రీ బుకింగ్ విజయంలో ఉపకరించాయని అన్నారు. ఫోల్డ్4, ప్లిఫ్4 ఫోన్స్ కోసం శాంసంగ్ తన రిటైల్ నెట్వర్క్ను భారీగా విస్తరిస్తూ ద్వితీయ శ్రేణి పట్టణాలు సహా 10,000 నగరాల్లో నెట్వర్క్ను విస్తరించింది.
ఫోల్డబుల్ ఫోన్ల రిటైల్ అవుట్లెట్లు రెట్టింపయ్యాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్ల కోసం ఫోల్డ్4, ప్లిఫ్4 డెమోల కోసం 12,000 డెమో పీస్లను అందుబాటులో ఉంచడంతో వారు మెరుగైన అనుభూతిని ఆస్వాదించారని పుల్లన్ పేర్కొన్నారు. స్నాప్డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరాతో మెరుగైన డివైజ్గా ఫోల్డ్4 కస్టమర్ల ముందుకొచ్చింది. ఫ్లెక్స్ కెమెరాను కోరుకునే యువ కస్టమర్లకు నచ్చేలా ప్లిఫ్4 అల్టిమేట్ డివైజ్గా ఆకట్టుకుంటోంది. పర్పుల్, గ్రాఫైట్, పింక్ గోల్డ్ కలర్స్లో లభించే గెలాక్సీ జడ్ ప్లిఫ్ రూ 89,999 నుంచి రూ 94.999 మధ్య లభిస్తుంది. ఇక గెలాక్సీ జడ్ ఫోల్డ్4 రూ 1.5 లక్షల నుంచి రూ 1.64 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది.