Samsung Galaxy A53 5G | సామ్సంగ్ నుంచి గెలాక్సీ సిరీస్లో భాగంగా ఏ53 5జీ ఫోన్ తాజాగా భారత్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ సేల్స్ మార్చి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏ సిరీస్లో వచ్చిన బెస్ట్ ఫోన్లలో ఇదీ ఒకటి. గత వారం గెలాక్సీ ఏ33 5జీ ఫోన్ను సామ్సంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సామ్సంగ్ గెలాక్సీ ఏ53 5జీ ఫోన్ను ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చేసింది.
120 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టా కోర్ ఎక్సినోస్ 1280 ఎస్వోసీ, క్వాడ్ రేర్ కెమెరా సెటప్, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టంట్, ఐపీ67 రేటింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ను లాంచ్ చేశారు.
సామ్సంగ్ గెలాక్సీ ఏ53 5జీ ఫోన్ బేసిక్ వేరియంట్ 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,499గా ఉంది. 8 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా ఉంది. మార్చి 27 నుంచి ఫోన్ల డెలివరీ ప్రారంభం కానుంది. సామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్ను కంపెనీ వెబ్సైట్లో ప్రి ఆర్డర్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1, 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 120 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టా కోర్ ఎక్సినోస్ 1280 ఎస్వోసీ, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రిలీజ్ అయింది.