చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ( Xiaomi ) రెడ్మీ నోట్ 10 సిరీస్లో నా లుగో ఫోన్ రెడ్మీ నోట్ 10ఎస్ను మే 13న భారత్లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించింది. రెడ్మీ నుంచి మరో కొత్త ప్రొడక్ట్ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. వేరబుల్ డివైజ్ను విడుదల చేయబోతున్నట్లు #wearyourVIBE హ్యాష్ట్యాగ్తో ఓ టీజర్ రిలీజ్ చేసింది.
ఇది కచ్చితంగా స్మార్ట్వాచ్( Redmi Watch ) అని తెలుస్తున్నది. నోట్ 10ఎస్ స్మార్ట్ఫోన్తో పాటే రెడ్మీ వాచ్ను భారత్లో మే 13న లాంచ్ చేస్తామని షియోమీ ప్రకటించింది. రెడ్మీ వాచ్ను గత నవంబర్లోనే చైనాలో ఆవిష్కరించారు. దీని ధర సుమారు 3500గా ఉండొచ్చు.