ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోమీ.. గత నెలలోనే రెడ్మీ నోట్ 11 సిరీస్ను చైనాలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రెడ్మీ నోట్ 11 సిరీస్లో రెడ్మీ నోట్ 11 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మోడల్స్ను రిలీజ్ చేసింది. అవే మోడల్స్ ఫోన్లను ఇండియాలో రీబ్రాండ్ పేరుతో లాంచ్ చేయనుంది.
నవంబర్ 30న రెడ్మీ నోట్ 11 5జీ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేయనుంది జియోమీ. దానికి రెడ్మీ నోట్ 11 టీ 5జీ అనే పేరును పెట్టింది.
ఈ సంవత్సరం జులైలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 10టీ 5జీ ఫోన్కు ఇది కొనసాగింపుగా వస్తోంది. రెడ్మీ నోట్ 11టీ 5జీ ఫోన్ను గ్లోబల్ మార్కెట్లో పోకో ఎం4 ప్రో 5జీ ఫోన్గా జియోమీ లాంచ్ చేయనుంది.
రెడ్మీ నోట్ 11టీ 5జీ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్స్, మూడు కలర్స్ వేరియంట్స్లో లభించనుంది. 6జీబీ ప్లస్ 64 జీబీ, 6జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్తో పాటు మూడు కలర్స్ ఆప్షన్లు, బ్లూ, బ్లాక్, వైట్ కలర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్షిటీ 810 ఎస్వోసీ, 50 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో రెడ్మీ నోట్ 11టీ 5జీ ఫోన్ భారత మార్కెట్లో నవంబర్ 30 న విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
iPhone | ఐఫోన్ 13పై రూ.25వేల తగ్గింపు.. ఎలా పొందాలంటే?
Vivo : వివో వై50టీ 48-మెగాపిక్సెల్ కెమెరా లాంఛ్..ధర ఎంతంటే!
OnePlus 10 Pro : ఫిబ్రవరిలో వన్ప్లస్ ప్రొ 10 లాంఛ్..ధర ఎంతంటే!
టెక్నో పాప్ 5సీ బడ్జెట్ స్మార్ట్ఫోన్ లాంఛ్