న్యూఢిల్లీ : రెడ్మి నోట్ 11 సిరీస్కు చెందిన రెడ్మి నోట్ 11 4జీ చైనాలో లాంఛ్ అయింది. ట్రిపుల్ కెమెరా సెటప్తో 6.5 ఇంచ్ ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే వంటి ఫీచర్లతో కూడిన రెడ్మి నోట్ 11 4జీ మీడియాటెక్ హెలియో జీ88 ప్రాసెసర్తో అందుబాటులో ఉంది.
5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఫాస్ట్చార్జింగ్ వెసులుబాటు కలిగిన ఈ స్మార్ట్ఫోన్ డ్రీమీ క్లియర్ స్కై, మిస్టీరియస్ బ్లాక్ల్యాండ్, టైం మోనోలాగ్ కలర్స్లో లభిస్తుంది. ఇక రెడ్మి నోట్ 11 4జీ భారత్ లాంఛ్పై ఇంకా స్పష్టత రాలేదు. రెడ్మి నోట్ 11 4జీ రూ 12,000 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంది.