న్యూఢిల్లీ : రియల్మి జీటీ నియో 3టీ జూన్ 7న ఇండోనేషియాలో లాంఛ్ కానుండగా వచ్చే నెలలోనే భారత్లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రియల్మి జీటీ నియో 3టీ 150డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో రానుందని ట్విట్టర్లో రిలీజైన టీజర్ పోస్ట్లో వెల్లడైంది.
క్వాల్కాం స్నాప్డ్రాగన్ 870 చిప్సెట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో రియల్మి జీటీ నియో 3టీ కస్టమర్ల ముందుకు రానుందని భావిస్తున్నారు. రియల్మి లేటెస్ట్ పోన్ ట్రిపుల్ కెమెరా సెటప్తో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో పాటు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఇక నియో 3టీ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్తో 6.62 ఇంచ్ ఈ4 అమోల్డ్ డిస్ప్లేను కలిగిఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత యూఐ 3.0 ఓఎస్పై ఈ ఫోన్ రన్ అవుతుండగా నియో 3టీ మార్కెట్లోకి వస్తే వన్ప్లస్ 10ఆర్, షియామి 11టీ ప్రొ, ఐక్యూఓఓ 9 వంటి ఫోన్లకు దీటైన పోటీ ఇవ్వనుంది. రియల్మి జీటీ నియో 3టీ ధర విషయానికి వస్తే ఈ ఫోన్ భారత్లో రూ 40,000లోపు అందుబాటులో ఉంటుంది.