న్యూఢిల్లీ : రియల్మీ జీటీ 3ని ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రియల్మీ జీటీ నియో 5 రీబ్రాండెడ్ వెర్షన్గా రియల్మీ జీటీ 3 కస్టమర్ల ముందుకు రానుంది. రియల్మీ జీటీ 3 స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ను కలిగిఉంటుంది.
స్పెయిన్లో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికగా కంపెనీ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేయనుంది. నియో 5 తరహాలో రియల్మీ జీటీ 3 240డబ్ల్యూ చార్జింగ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఈ హాట్ డివైజ్ వెనుకభాగంలో పర్పుల్ ఎల్ఈడీ లైట్తో ట్రిపుల్ కెమెరా సెటప్తో రానుంది. రియర్ కెమెరా సెటప్లో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్తో ఓఐఎస్ సపోర్ట్ను కలిగిఉంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్లతో రియల్మీ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ రానుంది.