PAN-Aadhaar linking | ఈ రోజుల్లో ఆధార్ కార్డు లేకుంటే ఏ పనీ జరగదు. సిమ్ కార్డు దగ్గర్నుంచి.. బ్యాంక్లో అకౌంట్ తీయాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాగే.. ఆధార్ కార్డును అన్ని రకాల సర్వీసులకు లింక్ చేస్తోంది భారత ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు.. ఇంకేదో కావచ్చు.. అన్నింటికీ ఆధారే ఆధారం. అందుకే.. ఆధార్ కార్డు, పాన్ కార్డును కూడా భారత పౌరులు లింక్ చేసుకోవాలని కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వం తెలిపింది. ఎలా లింక్ చేసుకోవాలో కూడా స్పష్టం చేసింది.
అయినా కూడా ఇంకా కొందరు పౌరులు.. ఆధార్, పాన్ లింక్ చేసుకోలేదు. ముఖ్యంగా.. ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరు పాన్, ఆధార్ను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. మార్చి 31 లోపు ఆధార్, పాన్ కార్డును లింక్ చేసుకోవాలని ప్రకటించింది.
కోవిడ్ మహమ్మారి వల్ల.. ఆధార్, పాన్ లింక్ గడువు తేదీని ఈ సంవత్సరం మార్చి 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పొడిగించింది. అయితే.. ఈసారి మాత్రం ఇక గడువును పొడిగించేది లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. మార్చి 31 లోపు ఆధార్, పాన్ను లింక్ చేసుకోని వాళ్లకు రూ.10 వేల ఫైన్ను విధిస్తామని సీబీడీటీ హెచ్చరించింది.
పాన్, ఆధార్ లింక్ను ఖచ్చితత్వం చేయడం వెనుక డుప్లికేట్ పాన్ కార్డులను ఏరిపారేయడమే. చాలామంది ఆర్థిక లావాదేవీల కోసం డుప్లికేట్ పాన్ కార్డులను కూడా వాడుతున్నట్టు తేలింది. దీంతో పాన్, ఆధార్ లింక్ను కంపల్సరీ చేసింది ప్రభుత్వం. దాని వల్ల.. ఏది ఒరిజినల్.. ఏది నకిలీ కార్డో ఇట్టే తెలిసిపోతుంది.
దాని కోసం www.incometaxindiaefiling.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి లింక్ ఆధార్(link Aadhaar) అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పూర్తి పేరు, ఇతర వివరాలు అందించాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. లింక్ ఆధార్(link Aadhaar) అనే బటన్ మీద క్లిక్ చేస్తే చాలు.. 10 రోజుల్లో ఆధార్, పాన్ కార్డు లింకింగ్ పూర్తవుతుంది.