న్యూఢిల్లీ : ప్రీమియం 5జీ ఫోన్ ఒప్పో రెనో 8టీ ఫిబ్రవరి 8న గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. భారత్లోనూ ఒప్పో రెనో 8టీ లాంఛ్ కానుండగా అధికారికంగా లాంఛ్ డేట్ను కంపెనీ వెల్లడించలేదు. ఫిబ్రవరి తొలి వారంలో భారత్లో ఒప్పో లేటెస్ట్ ఫోన్ రానుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ లీక్ చేశారు. భారత్లో ఈ ప్రీమియం 5జీ ఫోన్ ధర, ఒప్పో రెనో 8టీ ఇమేజ్లనూ ఆయన వెల్లడించారు.
ఒప్పో రెనో 8టీ ధర రూ. 27,000 నుంచి రూ. 29,000 మధ్య ఉంటుందని అంచనా. న్యూ ఒప్పో ఫోన్ ఈ ప్రైస్ రేంజ్లో రెడ్మి నోట్ 12 ప్రొ+, రియల్మీ 10 ప్రొ వంటి హాట్ డివైజ్లకు దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఒప్పో లేటెస్ట్ ఫోన్ కర్వ్డ్ స్క్రీన్తో వెరీ స్లిమ్ ప్రొఫైల్తో ఆకట్టుకుంటుందని ఈ లీక్స్లో వెల్లడైంది. ముందు భాగంలో టిపికల్ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్తో రానున్న ఒప్పో రెనో 8టీ యల్లో, బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉంటుంది.
ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ హెలియో జీ99 ప్రాసెసర్తో కస్టమర్ల ముందుకు రానుంది. ఒప్పో రెనో 8టీ 108 ఎంపీ మెయిన్ సెన్సర్, 2 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెన్సర్లతో ముందుభాగంలో సెల్పీల కోసం 32 ఎంపీ కెమెరాను కలిగిఉంటుందని అంచనా. ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది. న్యూ ఒప్పో ఫోన్ లేటెస్ట్ అండ్రాయిడ్ 13 ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది.