న్యూఢిల్లీ : భారత్లో ఒప్పో రెనో 8టీ 5జీని ఒప్పో లాంఛ్ చేసింది. దేశీ మార్కెట్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్తో పాటు ఎన్కో ఎయిర్ 3 ఇయర్బడ్స్ను ప్రవేశపెట్టింది. రెనో 8 సిరీస్లో భాగంగా ఒప్పో రెనో 8టీ 5జీ ప్రస్తుత రెనో 8 ప్రొ, బడ్జెట్ స్మార్ట్ఫోన్ రెనో 8లకు మధ్యశ్రేణి ఫోన్గా అందుబాటులోకి వచ్చింది.
ఒప్పో రెనో 8టీ 5జీ 108 ఎంపీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ కర్వ్డ్ డిస్ప్లేతో 4800ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఈ స్మార్ట్ఫోన్ సన్రైజ్ గోల్డ్, మిట్నైట్ బ్లాక్ కలర్స్లో లభిస్తోంది. ఒప్పో రెనో 8టీ 8జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 29,999కు లభిస్తోంది.
ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్, ఒప్పో అధికారిక ఛానెల్స్పై ప్రీ ఆర్డర్ సేల్లో అందుబాటులో ఉంది. ఒప్పో రెనో 8టీ 5జీ 6.7 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్, 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమరాతో ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 695 5జీ ఎస్ఓసీని కలిగిఉంది. ఒప్పో లేటెస్ట్ డివైజ్ కలర్ఓఎస్ 13పై రన్ అవుతుంది.