Oppo 4G A77 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో దేశీయ మార్కెట్లోకి లో బడ్జెట్ 4జీ స్మార్ట్ ఫోన్ `ఏ77` ఆవిష్కరించింది. 50 మెగా పిక్సెల్స్ (ఎంపీ), ఏఐ డ్యుయల్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.17,999. 33 వాట్ల సామర్థ్యం గల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జర్ జతగా వస్తుంది. ఐదు నిమిషాలు చార్జిం్ చేస్తే మూడు గంటల పాటు కాల్లో మాట్లాడుకునే సామర్థ్యం ఉంటుంది.
8జీబీ రామ్ గల ఏ77 ఫోన్ 128 జీబీల ఇంటర్నరల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. 6.56 అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 వర్షన్పై కలర్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తుంది. సూపర్ వూక్ చార్జర్తోపాటు 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో వస్తున్నది.
సన్సెట్ ఆరెంజ్, స్టార్రీ బ్లాక్ కలర్స్లో 8 మెగా పిక్సెల్ (ఎంపీ)తో కూడిన సెల్ఫీ కెమెరా వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 50 ఎంపీ కెపాసిటీ గల రేర్ కెమెరా, 2 ఎంపీ మొనో రేర్ కెమెరా ఫీచర్లు జత చేశారు. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్తో 90హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. డ్యుయల్ సిమ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవచ్చు.
3.5 ఎంఎం ఆడియో జాక్, 4జీ తోపాటు వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉంటాయి. శుక్రవారం నుంచి మార్కెట్లో కొనుగోలు చేయొచ్చు. సెలెక్టెడ్ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తున్నది ఒప్పో.