న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో తన బడ్జెట్ 4జీ స్మార్ట్ఫోన్ ఒప్పో ఏ95ను త్వరలో లాంఛ్ చేసేందుకు ఒప్పో సన్నద్ధమైంది. ఏ95 ప్రోమో ఇమేజ్లు లీక్ కావడంతో స్మార్ట్ఫోన్కు చెందిన పలు వివరాలను 91మొబైల్స్ వెల్లడించింది. ఒప్పో ఏ95 6.43 ఇంచ్ల ఫుల్హెచ్డీ అమోల్డ్ డిస్ప్లేతో కలర్ఓఎస్ 11, ఆండ్రాయిడ్ 11, అడెర్నో 610 జీపీయూలపై రన్ అవుతుందని తెలిపింది.
ఏ95 గ్లోయింగ్ స్టారీ బ్లాక్, రెయిన్బో సిల్వర్ వంటి రెండు కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్తో ఒప్పో ఏ95 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుందని 91మొబైల్స్ తెలిపింది. ఈ బడ్జెట్ 4జీ స్మార్టఫోన్ను అతిత్వరలో భారత్ మార్కెట్లో ఒప్పో లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు.