OnePlus Pad | చైనా టెక్నాలజీ జెయింట్ `వన్ప్లస్ (OnePlus)` రూపొందించిన తొలి టాబ్లెట్.. `వన్ప్లస్ పాడ్ (OnePlus Pad) త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానున్నది. తొలిసారి గత ఫిబ్రవరిలో కంపెనీ `క్లౌడ్11` ఈవెంట్లో వన్ప్లస్ పాడ్ ఆవిష్కరించిన సంస్థ, ధర వివరాలు వెల్లడించలేదు. తాజాగా వెబ్సైట్లో ఈ టాబ్లెట్ ధర అక్షరాల రూ.37,999 అని వెల్లడించింది. అంతే కాదు ఈ నెల 28 నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభిస్తామని కూడా తెలిపింది.
భారత్ మార్కెట్లో వన్ ప్లస్ పాడ్ (OnePlus Pad) రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.37,999, 12జీబీ రామ్ విత్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.39,999లకు అందుబాటులో ఉంటుంది.
ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్, వన్ప్లస్ అధికారిక వెబ్సైట్లో ఈ నెల 28 నుంచి వన్ప్లస్ పాడ్ (OnePlus Pad) ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ప్రీ-బుకింగ్స్ నమోదు చేసుకున్న వారు రూ.1499 విలువైన ఫోలియో కేస్ ఉచితంగా అందుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసిన వారికి రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సహా పలు బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ అందుబాటులో ఉంది.
వన్ప్లస్ పాడ్ 11.6 అంగుళాల 2.8కే ఎల్సీడీ డిస్ప్లే విత్ 2800 x 2000 పిక్సెల్స్ రిజొల్యూషన్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ వర్షన్పై పని చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్లో 8-మెగా పిక్సెల్ కెమెరాతోపాటు టాబ్లెట్ రేర్లో ఎల్ఈడీ ఫ్లాష్తో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా వస్తుంది.
పవర్ బ్యాకప్ కోసం 9,510 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ 67వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్తో వస్తుంది. 60 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్ అవుతుంది. స్టాండ్బై మోడ్లో ఒక నెల వరకు ఆన్లో ఉంటుంది. వై-ఫై6, బ్లూటూత్ వీ5.3, టైప్ సీ-పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంది.