OnePlus | స్మార్ట్ ఫోన్ ప్రియులకు చైనా టెక్ సంస్థ వన్ ప్లస్ బంపరాఫర్ అందిస్తున్నది. ఈ నెల నాలుగో తేదీన దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన న్యూ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ `వన్ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ`పై వన్ డే ఆఫర్ అందిస్తున్నది. ఈ ఫోన్లు ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్, వన్ప్లస్ అఫిషియల్ వెబ్సైట్లలో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించింది వన్ప్లస్.
ఈ నెల 11 నుంచి అంటే మంగళవారం నుంచి వన్ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్లు బుక్ చేసుకోవచ్చు. తొలి రోజు ఈ ఫోన్లు బుక్ చేసుకునే వారికి `వన్ప్లస్ బడ్స్ సీఈ` ఉచితంగా అందిస్తామని తెలిపింది. ప్రస్తుతం వన్ప్లస్ వెబ్సైట్లో రూ.2,999లకు ఈ బడ్స్ లభిస్తున్నాయి.
వన్ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్పై సంస్థ ఏడాది వారంటీ అందిస్తున్నది. కొనుగోలు చేస్తున్నప్పుడు అదనంగా రూ.99 చెల్లిస్తే మరో ఏడాది వారంటీ అందుబాటులో ఉంటుంది. అదనంగా రూ.1999 చెల్లిస్తే 12 నెలల స్క్రీన్ ప్రొటెక్టర్ ప్లాన్, రూ. 2499 పే చేస్తే యాక్సిడెంటల్ డ్యామేజీ ప్రొటెక్షన్ ప్లాన్ లభిస్తుంది. ఈ ప్లాన్ 12 నెలలు అమల్లో ఉంటుంది. వన్ ప్లస్ ప్లాన్ కింద రూ.5499 చెల్లిస్తే అన్ని రకాల డ్యామేజీలకు కవరేజీ లభిస్తుంది.