Motorola : మోటోరోలా ఇండియా నూతన సంవత్సర ఆరంభంలో అందుబాటు ధరలో మరో 5జీ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. 5జీ సపోర్ట్తో క్వాల్కాం స్నాప్డ్రాగన్ 695 చిప్సెట్తో 50 మెగాపిక్సెల్ కెమెరాలు వంటి ఫీచర్లతో ఆల్ న్యూ మోటో జీ71 5జీ కస్టమర్ల ముందుకొచ్చింది.రియల్మీ నార్జో 30 ప్రొ 5జీ, రెడ్మి నోట్ 11టీ 5జీ వంటి ఫోన్లకు మోటో జీ71 5జీ దీటైన పోటీ ఇవ్వనుంది.
ఈ ఫోన్ నియర్-స్టాక్ ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్వేర్పై రన్ కానుంది. మోటో జీ71 5జీ 6జీబీ ర్యాం, 2జీబీ ర్యాం బూస్ట్ ఫీచర్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో లభిస్తుంది. మోటో జీ71 5జీ నెప్ట్యూన్ గ్రీన్, బ్లూ కలర్స్లో లభించే మోటీ జీ71 5జీ భారత్లో రూ 18,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ జనవరి 19 రాత్రి 12 గంటల నుంచి ప్లిఫ్కార్ట్లో సేల్ షురూ అవుతుంది.
లాంఛ్ ఆఫర్ల గురిచి మోటోరోలా ఇప్పటివరకూ వెల్లడించకపోయినా ఫ్లిఫ్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈకామర్స్ సైట్పై ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, ఇతర డిస్కౌంట్ల వివరాలు వెల్లడికావచ్చు. 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లేను కలిగిన మోటీ జీ71 5జీ 33డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.