ముంబై : మొటోరోలా భారత్ మార్కెట్లో మోటో జీ62 5జీని గురువారం లాంఛ్ చేసింది. భారత్లో జీ సిరీస్ను విస్తరించే క్రమంలో మొటోరోలా ఇటీవల జీ32ను ప్రవేశపెట్టింది. ఇక మోటో జీ62 12 5జీ బ్యాండ్స్ను సపోర్ట్ చేస్తూ కస్టమర్ల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ స్మార్ట్పోన్ పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 695ని కలిగిఉంది. ఈ స్మార్ట్ఫోన్ ఇతర ఫీచర్లతో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
మోటో జీ62 భారత్ మార్కెట్లో అతితక్కవు ధరకు లభించే 5జీ ఫోన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక మోటో జీ62 5జీ ఎక్స్లూజివ్గా ఫ్లిప్కార్ట్ ఫ్లాట్ఫాంపై అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ భారత్లో రూ 20,000 లోపు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. మోటో జీ62 5జీ ధర రూ 21,999గా ఉంటుందని ప్రైస్బాబా కధనం పేర్కొంది. బ్రెజిల్లో అధికారికంగా ఈ డివైజ్ లాంఛ్ కాగా అప్గ్రేడ్ స్పెసిఫికేషన్స్తో మోటో జీ62 5జీ భారత్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.
మొటోరోలా లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్తో 6.55 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగిఉంది. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో మోటో జీ62 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్లను కలిగిఉంది. మోటో జీ62 5జీ అండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్పై రన్ అవనుంది.