న్యూఢిల్లీ : భారత్లో తొలి 5జీ ఆధారిత లెనోవా ట్యాబ్ పీ11 5జీ ట్యాబ్లెట్ లాంచ్ అయింది. న్యూ అండ్రాయిడ్ ట్యాబ్లెట్ 11 ఇంచ్ డిస్ప్లేతో, క్వాల్కాం స్నాప్డ్రాగన్ 750జీ 5జీ చిప్సెట్తో లెనోవా లేటెస్ట్ ట్యాబ్ కస్టమర్ల ముందుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్స్లో లభించే లెనోవా ట్యాబ్ పీ11 5జీ బేస్ మోడల్ రూ. 29,999 నుంచి అందుబాటులో ఉంది.
టాప్ 256జీబీ వేరియంట్ రూ . 34,999కి లభిస్తుంది. కస్టమర్లు అమెజాన్, అదికారిక లెనోవా స్టోర్స్లో లేటెస్ట్ ట్యాబ్లెట్ను కొనుగోలు చేయవచ్చు. లెనోవా ట్యాబ్ పీ11 5జీ 11 ఇంచ్ 2కే రిజల్యూషన్ డిస్ప్లేతో పాటు స్టైలస్ సపోర్ట్ను కలిగిఉంది.
డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్కు లెనోవా లేటెస్ట్ ట్యాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. ఇతర కీలక ఫీచర్ల విషయానికి వస్తే లెనోవా ట్యాబ్ పీ 11 5జీ 20డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్తో 7700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకొచ్చింది. ట్యాబ్ పీ11 5జీ 12 గంటల వరకూ నాన్ స్టాప్ వీడియో స్ట్రీమింగ్ను ఆఫర్ చేస్తుంది.