న్యూఢిల్లీ : జియోబుక్ ల్యాప్టాప్ ప్రస్తుతం భారత్లో ప్రతిఒక్కరికీ రూ 15,000 లోపు అందుబాటులోకి వచ్చింది. తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్లను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లకు జియోబుక్ ల్యాప్టాప్ సరైన ఎంపికని టెక్ నిపుణులు చెబుతున్నారు.
రిలయన్స్ జియో ఇటీవల ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఈఎంసీ) ఈవెంట్ వేదికగా ఈ ల్యాప్టాప్ను లాంఛ్ చేయగా తొలుత ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండగా తాజాగా వినియోగదారులందరికీ లభిస్తోంది. జియోబుక్ ల్యాప్టాప్ ఖరీదు రూ 15,799 ప్రారంభ ధర కాగా, కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా వీటిని సొంతం చేసుకోవచ్చు.
పలు బ్యాంకు కార్డులపై రూ 5000 వరకూ ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుండగా, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ 5000 తగ్గింపు లభిస్తోంది. జియోబుక్ 11.6 ఇంచ్ హెచ్డీ డిస్ప్లేతో పాటు ముందుభాగంలో వీడియో కాల్స్ కోసం 2 ఎంపీ కెమెరా కలిగిఉంది. తక్కువ బడ్జెట్లో బ్రౌజింగ్తో పాటు ఎడ్యుకేషన్ అవసరాల కోసం ఈ ల్యాప్టాప్ మెరుగ్గా ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్టాప్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 665 ఎస్ఓసీ చిప్సెట్ను కలిగిఉంది.