ఇప్పటికే చౌక ధర స్మార్ట్ఫోన్లు జియో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన రిలయెన్స్ జియో మరో సంచలనానికి తెర లేపింది. గూగుల్ కంపెనీతో కలిసి.. జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్ఫోన్ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. సెప్టెంబర్ 10న ఈ ఫోన్ను ఇండియాలో రిలీజ్ చేయనున్నారు. అయితే.. ఈ ఫోన్ ఇంకా రిలీజ్ కాకముందే.. ఈ ఫోన్లోని ఫీచర్స్ మాత్రం అప్పుడే లీక్ అయిపోయాయి.
ఆండ్రాయిడ్ ఓఎస్తో రిలీజ్ అయ్యే ఈ ఫోన్ ఇతర బ్రాండ్స్ ఫోన్ల కన్నా చౌక ధరకు లభించనుంది.
4జీ నెట్వర్క్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ గో ఓఎస్తో పనిచేస్తుంది. కాకపోతే.. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ను బేస్ చేసుకొని ఈ ఓఎస్ పనిచేస్తుంది. కాకపోతే.. అన్ని రకాల గేమింగ్ యాప్స్ ఇందులో అందుబాటులో ఉండవు. కొన్ని యాప్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది కానీ.. ఫోన్లోని హార్డ్వేర్ ఫీచర్స్కు అనుకూలంగా ఉండే యాప్స్ను మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. జియో ఫోన్ నెక్స్ట్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంటుంది.
క్వాల్కామ్ క్యూఎమ్215 ప్రాసెసర్, 64 బిట్ సీపీయూ, డ్యూయల్ ఐఎస్పీ సపోర్ట్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ లేదా 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, మెమోరీ కార్డ్ స్లాట్, 13 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5.5 ఇంచ్ నుంచి 6 ఇంచ్ మధ్యలో డిస్ప్లే సైజ్, 1440 * 720 పిక్సెల్ హెచ్డీ రిజల్యూషన్, 3000 ఎంఏహెచ్ లేదా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది. ఈ ఫీచర్లకు గాను.. ఈ ఫోన్ను కేవలం రూ.3500 లోపే అందించేందుకు జియో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.