ISRO : భారత అంతరిక్ష రంగంలో మరో ప్రయోగం విజయవంతమైంది. హైపర్ సోనిక్ వాహన ట్రయల్స్ను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. హెడ్ క్వార్టర్స్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఉమ్మడిగా ఈ ప్రయోగం నిర్వహించాయి. ఈ ట్రయల్స్ నిర్దేశించిన ప్రమాణాలను అందుకున్నాయి. అంతేకాదు హైపర్ సోనిక్ వాహనం సామర్థ్యాన్ని నిరూపించాయి అని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్లోని ట్రైసోనిక్ విండ్ టన్నెల్ మొదటి బ్లో డౌన్ టెస్ట్ను సక్సెస్ఫుల్గా ముగించింది.
గత రెండేళ్లుగా మనదేశంలో హైపర్సోనిక్ టెక్నాలజీ మీద పరిశోధన జరుగుతోంది. మనదేశం రష్యాతో కలిసి హైపర్ సోనిక్ క్షిపణులను తయారుచేస్తోంది. వీటిని 2019, 2020 సెప్టెంబర్లో ఇస్రో పరీక్షించింది. హైపర్సోనిక్ వాహనం అనేది ఒక క్షిపణి, విమానం లేదా ఒక అంతరిక్ష నౌక కూడా కావొచ్చు. హైపర్సోనిక్ వాహనాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణిస్తాయి. ఈ టెక్నాలజీలో మనదేశంతో పాటు అమెరికా, రష్యా, చైనా దేశాలు ముందంజలో ఉన్నాయి