iPhone SE 2022 | గత వారం యాపిల్ సంస్థ ఐఫోన్ ఎస్ఈ 2022 మోడల్ ఫోన్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ సేల్స్ తాజాగా భారత్లో ప్రారంభం అయ్యాయి. ఐఫోన్ ఎస్ఈ 2022 తో పాటు ఐపాడ్ ఎయిర్ 2022 సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఐఫోన్ ఎస్ఈ 2022 ఫోన్.. లేటెస్ట్ ప్రాసెసర్ యాపిల్ ఏ15 బయోనిక్ చిప్, బెస్ట్ రేర్ కెమెరా, 5జీ కనెక్టివిటీ ఆప్షన్ను కలిగి ఉంది.
ఐపాడ్ ఎయిర్ 2022లో ఎం1 చిప్ ఉంటుంది. ఈ చిప్ మాక్బుక్ మోడల్స్లో కూడా ఉంటుంది. దీనికి కూడా 5జీ సపోర్ట్ ఉంది. ఐఫోన్ ఎస్ఈ, ఐపాడ్ ఎయిర్తో పాటు ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్ అన్నీ ప్రస్తుతం భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ ఎస్ఈ 2022, 64 జీబీ మోడల్ ధర భారత్లో రూ.43,900గా ఉంది. 128 జీబీ మోడల్ ధర రూ.48,900గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ 256 జీబీ ధర రూ.58,900గా ఉంది. మిడ్నైట్, స్టార్లైట్, రెడ్ కలర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ఐపాడ్ ఎయిర్ 2022 వైఫై మోడల్ 64 జీబీ మోడల్ ధర రూ.54,900గా ఉంది. 256 జీబీ వేరియంట్ ధర రూ.68,900గా ఉంది. ఐపాడ్ ఎయిర్ 2022 వైఫై ప్లస్ సెల్యులర్ వేరియంట్ 64 జీబీ మోడల్ ధర రూ.68,900గా ఉండగా… 256 జీబీ వర్షన్ ధర రూ.82,900గా ఉంది. ఐపాడ్ ఎయిర్ 2022.. బ్లూ, పింక్, పర్పల్, స్పేస్ గ్రే కలర్స్లో లభిస్తుంది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఆఫ్లైన్ స్టోర్స్లోనూ ఐఫోన్ ఎస్ఈ 2022, ఐపాడ్ ఎయిర్ 2022ను కొనుగోలు చేయొచ్చు. యాపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్లోనూ ఐపాడ్ ఎయిర్ 2022ను కొనుగోలు చేయొచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్తో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు రూ.2000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఐపాడ్కు రూ.4000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.