యాపిల్ ఐఫోన్తో పాటు.. ఐప్యాడ్, వాచ్ యూజర్లకు యాపిల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఐవోఎస్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ 15ను ఇండియాలో ఈరోజు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రీసెంట్ ఐఫోన్ మోడల్స్తో పాటు.. సెవెన్త్ జనరేషన్ ఐపాడ్ టచ్, ఐప్యాడ్ఎస్లలో కొత్త అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఐవోఎస్ 15 లో షేర్ప్లేతో పాటు ఫోకస్, ఫేస్టైమ్, మెసేజింగ్ ఫీచర్లను అందిస్తోంది. ఐప్యాడ్ఓఎస్ 15లో మల్టీ టాస్కింగ్, స్లయిడ్ ఓవర్, స్ప్లిట్ వ్యూ ఆప్షన్లు ఉంటాయి. అలాగే.. యాపిల్ వాచ్ యూజర్ల కోసం వాచ్ఓఎస్ 8 కూడా సరికొత్త ఫీచర్లతో విడుదల అవుతోంది.
iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone 6s, iPhone 6s Plus, iPhone SE, and the iPhone SE (2020) మోడల్స్లో ఐవోఎస్ 15ను అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 13 అన్ని మోడల్స్లో ఐవోఎస్ 15 ప్రీలోడ్ అయి ఉంటుంది. ఐపాడ్ టచ్ సెవెన్త్ జనరేషన్ మోడల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అప్డేట్ యాపిల్ యూజర్లకు అందుబాటులోకి రాగానే.. ఐఫోన్ లేదా ఐపాడ్ టచ్ యూజర్లు ఐవోఎస్ 15 ను సెట్టింగ్స్లో జనరల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని.. సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. ఐవోఎస్ 15 డౌన్లోడ్ అయి ఇన్స్టాల్ అవుతుంది. మాక్ కంప్యూటర్లో మాన్యువల్గా ఐవోఎస్ 15ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.