దాదాపుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు ఇప్పటి వరకు ఉచితంగానే లాగిన్ అయ్యే అవకాశం ఉండేది. కానీ.. ఇక నుంచి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను యాక్సెస్ చేసుకోవాలంటే.. అందులోని ఎక్స్క్లూజివ్ కంటెంట్ను చూడాలంటే కొంత డబ్బు కట్టాల్సిందే. ఇక నుంచి సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ ఉచితంగా కనిపించదు. ఇప్పటికే ఫేస్బుక్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను తీసుకొచ్చింది. కొన్ని ఫేస్బుక్ పేజీలను.. వాళ్లు పోస్ట్ చేసే ఎక్స్క్లూజివ్ కంటెంట్ను పొందడానికి ఫేస్బుక్ కంట్రిబ్యూషన్ ఆప్షన్ను తీసుకొచ్చింది. దాని కోసం ఒక ఫేస్బుక్ పేజీకి నెలకు రూ.400 పే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
తాజాగా.. ఇన్స్టాగ్రామ్ కూడా అలాంటి ఫీచర్నే తీసుకొచ్చింది. పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్ను ఇప్పటికే యూఎస్లో కొందరు క్రియేటర్స్ కోసం తీసుకొచ్చిన ఇన్స్టా.. ఆ ఫీచర్ను భారత్లోనూ లాంచ్ చేసింది. కొందరు క్రియేటర్లు షేర్ చేసే ఫోటోలు, వీడియోలు, స్టోరీలను యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ యూజర్ అకౌంట్కు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో కూడా ప్రస్తుతం అందరు క్రియేటర్లకు కాకున్నా.. కొందరు క్రియేటర్లకు ఈ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎవరైతే ఎక్స్క్లూజివ్ కంటెంట్ను ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారో.. ఎక్స్క్లూజివ్ స్టోరీలు పోస్ట్ చేస్తున్నారో వాళ్లకు మాత్రమ ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. వాళ్ల ఫ్యాన్స్, ఫాలోవర్స్.. ఆ అకౌంట్కు కొంత డబ్బు చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్లు షేర్ చేసే కంటెంట్ను ఫాలోవర్స్ చూడగలుగుతారు.
సబ్స్క్రిప్షన్ కోసం క్రియేటర్స్ను బట్టి రూ.89, రూ.440, రూ.890 నెలకు చెల్లించాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ చేసుకున్న యూజర్ల నేమ్ పక్కన పర్పుల్ కలర్ టిక్మార్క్ ఉంటుంది. అయితే… ప్రస్తుతానికి క్రియేటర్స్ సబ్స్క్రిప్షన్ను ఫీచర్ను సెట్ చేసుకునే అవకాశం లేనప్పటికీ.. త్వరలోనే క్రియేటర్లు అందరికీ ఈ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొస్తామని ఇన్స్టా వెల్లడించింది.