Samudrayaan Mission | సముద్రయాన్ మిషన్ నిర్వహించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ ఏడాదే చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం చెన్నైలో ఇంజినీర్లు ఉక్కు గోళాన్ని రూపొందించారు. సముద్రంలో 500 మీటర్ల లోతుకు ముగ్గురు ఆక్వానాట్స్ను పంపడం మిషన్లో భాగం.
స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన సముద్రయాన్ నౌకను సముద్రం లోతుల్లోకి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సముద్రంలో 500 మీటర్ల లోతులో ముగ్గురు అన్వేషకులను పంపనున్నారు. ఇందుకు చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇంజినీర్లు ఆక్వానాట్ల ప్రయాణానికి వీలుగా ఉక్కు గోళాన్ని తయారుచేశారు. అయితే, 6000 మీటర్ల లోతుకు సముద్రయాన్ను పంపే ప్రణాళిక ఆ లోతుల్లో ఒత్తిడిని తట్టుకోగల టైటానియం గోళాన్ని కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో మిషన్ కొంత ఆలస్యమవుతున్నది. ప్రస్తుతం రూపొందించిన ఉక్కు గోళం 500 మీటర్ల లోతు వరకు ఒత్తిడిని తట్టుకోగలదని, అయితే మరింత లోతుగా ప్రయాణిస్తే మాత్రం ప్రమాదకరంగా మారుతుందని ఇంజినీర్లు చెప్తున్నారు.
వచ్చే ఏడాది చివరికల్లా మానవ అంతరిక్ష యానాన్ని చేపట్టడంపై మన దేశం దృష్టి సారించింది. గగన్యాన్ మిషన్ కోసం సాంతకేతికతలను పరీక్షించేందుకు ఇస్రో అన్క్రూడ్ మిషన్ చేపట్టాలని యోచిస్తున్నది. ఇదే ఏడాదిలోనే సముద్రయాన్ కూడా సాధించాలన్న పట్టుదలలో శాస్త్రవేత్తలు ఉన్నారు.