Flipkart Big Saving Days Sale 2022 | ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2022 సేల్ స్టార్ట్ అయింది. మార్చి 11 నుంచి ఫ్లిప్కార్ట్ మెంబర్స్కు ప్రారంభం అయింది. మార్చి 12 నుంచి అంటే ఈరోజు నుంచి మార్చి 16 దాకా అందరు కస్టమర్లకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. ఈ సేల్లో మొబైల్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్, హెడ్ఫోన్స్, ఇయర్బడ్స్ మీద భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు.
ఈ సేల్ కోసం ఫ్లిప్కార్ట్ ఎస్బీఐతో టైఅప్ అయింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేస్తే రూ.1250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ ఎస్ఈ(2020) ని ఈ సేల్లో భాగంగా రూ.29,999కే అందిస్తున్నారు. ఐఫోన్ ఎస్ఈ 2020 మీద రూ.9901 డిస్కౌంట్ లభిస్తోంది. దాని ఎంఆర్పీ ధర రూ.39,990. దానితో పాటు.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో అదనంగా రూ.750 డిస్కౌంట్ పొందొచ్చు.
ఐఫోన్ ఎస్ఈ 2020.. 4.7 ఇంచ్ రెటీనా హెచ్డీ డిస్ప్లే, 12 ఎంపీ రేర్ కెమెరా సెన్సార్, ఏ13 బయోనిక్ చిప్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇటీవలే యాపిల్ సంస్థ.. ఐఫోన్ ఎస్ఈ 2022ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
అలాగే.. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్, పోకో ఎం3 ప్రో 5జీ ఫోన్, ఇన్ఫినిక్స్ నోట్ 11 లాంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఈ సేల్లో భాగంగా అందిస్తున్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీలపై కూడా పలు ఆఫర్లను అందిస్తున్నారు. సామ్సంగ్ 6 55 ఇంచ్ క్యూఎల్ఈడీ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ, రియల్మీ బుక్ స్లిమ్ లాప్టాప్, రియల్మీ బాండ్ 2 లాంటి ప్రొడక్ట్స్పై కూడా భారీ డిస్కౌంట్లను ఈ సేల్లో పొందొచ్చు.