సోషల్ మీడియా అనేది జనాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఏదైనా ఒక విషయం జనాలకు తెలియాలంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు.. జనాలకు తెలిసిపోతుంది. ఒక విషయాన్నినెగెటివ్గా లేదా పాజిటివ్గా ప్రచారం చేయాలన్నా సోషల్ మీడియాలే వేదికలు.
అందుకే.. కొన్ని అనివార్య పరిస్థితుల్లో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తుంటాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా.. ఎన్నికల సమయంలో, ఓట్ల కౌంటింగ్ సమయంలో సోషల్ మీడియాను రిస్ట్రిక్ట్ చేస్తారు. దానికి కారణం.. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం జరిగి.. పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి.
ఇప్పుడు ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జాంబియాలోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయి. జాంబియాలో ఆగస్టు 12న అంటే నిన్న.. దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచే అక్కడ ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోల్స్ ముగిసిన 72 గంటల్లో అక్కడ ఫలితాలను వెల్లడిస్తారు. అయితే.. ఫలితాలు వెల్లడించే ఈ మూడు రోజుల పాటు.. అక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా నెట్వర్క్స్ను ఎన్నికల కమిషన్ బ్యాన్ చేసింది.
ఎలక్టోరల్ కమిషన్ ఆఫ్ జాంబియా(ఈసీజెడ్) ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితాలు వెలువడే వరకు ఈ సోషల్ మీడియా సైట్లతో పాటు.. ఇంటర్నెట్పై కూడా ఆంక్షలు ఉంటాయని ఈసీ వెల్లడించింది. ప్రెసిడెంట్ ఎడ్గర్ లుంగు, హకైండే హిచిలెమా మధ్య పోటీ నెలకొన్నది. అయితే.. సోషల్ మీడియా సైట్ల బ్యాన్పై ప్రస్తుత ప్రభుత్వం మాత్రం స్పందించలేదు.