న్యూఢిల్లీ : చాట్జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్కు విశేష ఆదరణ లభిస్తుండగా ఈ టూల్స్పై పరిశ్రమ దిగ్గజాలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఏఐ టూల్స్తో కొలువుల కోత తప్పదని పలువురు హెచ్చరిస్తుండగా ఉత్పాదకత మెరుగవుతుందని మరికొందరు సమర్ధిస్తున్నారు. ఏమైనా ఏఐ రాకతో చాట్జీపీటీ వంటి టూల్స్పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతోంది. గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిత్ కృత్రిమ మేధస్సు సాధనాల దుష్ప్రభావాలపై ప్రజలను హెచ్చరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అస్తిత్వ ప్రమాదాన్ని కలిగిస్తుంది, ఇది పలువురికి హాని తలపెట్టడమే కాదు పెద్దసంఖ్యలో ప్రజలను చంపేస్తుందని హెచ్చరించారు. వాల్స్ట్రీట్ జర్నల్ సీఈవో కౌన్సిల్లో ఎరిక్ ష్మిత్ మాట్లాడుతూ ఏఐ పర్యవసానాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవాళికి పెను ముప్పును కలిగిస్తుందని, పెద్ద సంఖ్యలో ప్రజలకు హాని తలపెట్టడం లేదా దీనిద్వారా మరణాలూ సంభవిస్తాయని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీలో సరికొత్త లోపాలను ఏఐ వ్యవస్ధలు కనిపెట్టే ప్రమాదం ఉందని, బయాలజీలో నూతన ఆవిష్కరణలకు బాటలువేస్తాయని అన్నారు.
ఏఐతో మన అస్తిత్వానికే ముప్పు అనేది తన ఆందోళన అని చెప్పుకొచ్చారు. ఏఐతో ఎంతో మందికి హానికరమని ఇది మానవాళిని చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసకారి వ్యక్తుల బారి నుంచి ఏఐ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఎరిక్ ష్మిత్ కోరారు. ఏఐని ఆయుధంగా వాడటం లేదా దుష్ట పన్నాగాలకు దీన్ని సాధనంగా చేసుకోవడం నిరోధించేందుకు కఠిన నియంత్రణలు అవసరమని అన్నారు.
Read More