న్యూఢిల్లీ : ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్ ప్లస్ మెంబర్స్కు షురూ కాగా ఈ సబ్స్క్రిప్షన్ కలిగిన వారు శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ను ఆకర్షణీయ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో ఈ ప్రీమియం 5జీ ఫోన్ను శాంసంగ్ లాంఛ్ చేయగా భారత్లో ఇది రూ 54,999 ప్రారంభ ధరకు లభిస్తోంది.
అయితే బిగ్ దివాళీ సేల్ ఈవెంట్లో ఫ్లిప్కార్ట్ ఈ స్మార్ట్ఫోన్ను కేవలం రూ 35,999కే విక్రయిస్తోంది. ఈ హ్యాండ్సెట్పై తాత్కాలికంగా రూ 19,000 తగ్గింపును ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. 8జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ మోడల్కు ఈ ధర వర్తిస్తుంది. ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ కార్డులు కలిగిన వారికి మరింత తక్కువ ధరకు ఈ స్మార్ట్ఫోన్ లభిస్తుంది.
ఈ బ్యాంక్ కార్డులపై రూ 1250 డిస్కౌంట్ అందుబాటులో ఉండగా దీంతో ఈ లేటెస్ట్ డివైజ్ను రూ 34,749కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే వైబ్రాంట్ అమోల్డ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ ఫాస్ట్, ల్యాగ్ ఫ్రీ ఫెర్ఫామెన్స్ను అందిస్తుంది. కెమెరా ఫెర్ఫామెన్స్ కూడా మెరుగ్గా వైబ్రాంట్ కలర్స్ను క్యాప్చర్ చేయడంలో మెరుగైన సామర్ధ్యం కలిగిఉంది. వైర్లెస్ చార్జింగ్కు ఈ స్మార్ట్ఫోన్ సపోర్ట్ చేస్తుంది.