న్యూఢిల్లీ : భారత్లో అల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ అండ్రాయిడ్ టీవీని కాంపాక్ట్ లాంఛ్ చేసింది. లేటెస్ట్ స్మార్ట్ టీవీ వీక్షకులకు 4కే వ్యూయింగ్ అనుభూతిని పంచుతుంది. ఎల్ఈడీ ప్యానెల్తో కూడిన ఈ స్మార్ట్ టీవీ పలు స్మార్ట్ ఫీచర్లకు సపోర్ట్ చేసే అండ్రాయిడ్ టీవీ ఓఎస్పై రన్ అవుతుంది. అల్ట్రా హెచ్డీ 4కే ఎల్ఈడీ స్మార్ట్ అండ్రాయిడ్ టీవీని కాంపాక్ట్ రూ 17.499కే ఆఫర్ చేస్తోంది.
ఫ్లిప్కార్ట్లో కాంపాక్ట్ లేటెస్ట్ స్మార్ట్టీవీ అందుబాటులో ఉంది. ఇక 50, 55 ఇంచ్ టీవీలను వరుసగా రూ 24.999, రూ 48,223కు ఆఫర్ చేస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ పేజ్లో లిస్టయింది. కాంపాక్ట్ అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ అండ్రాయిడ్ టీవీ 43 ఇంచ్ యూనిట్ భాతర్లో అత్యంత చవక 4కే స్మార్ట్ టీవీల్లో ఒకటని కంపెనీ చెబుతోంది.
ఈ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ డిస్ప్లే, అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్తో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వీడియో, డిస్నీ+ హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫాంలను సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్ నుంచి వీడియోలను కూడా కస్టమర్లు ప్లే చేసుకోవచ్చు. ఈ స్మార్ట్టీవీ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, స్మార్ట్ఫోన్ నుంచి టీవీకి కంటెంట్ను స్ట్రీమ్ చేసేందుకు బిల్టిన్ క్రోంకాస్ట్తో కస్టమర్ల ముందుకొచ్చింది.