Chandrayaan-3 | బెంగళూరు: జాబిల్లిపై చంద్రయాన్-3 కాలుమోపే చారిత్రక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం ‘ఎక్స్’లో వెల్లడించింది. తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్ల్యాండింగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే తాజాగా ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ను చంద్రుడిపై దించాలని నిర్ణయించారు. రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు అందరి కండ్లూ చంద్రయాన్-3పైనే ఉన్నాయి.
ఈ కక్ష్య నుంచే ల్యాండింగ్
ప్రయోగంలో కీలకమైన రెండో డీబూస్టింగ్ ప్రక్రియ సైతం విజయవంతమైంది. ఆదివారం ల్యాండర్ వేగాన్ని తగ్గించే విన్యాసాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రక్రియ అనంతరం ల్యాండర్ జాబిల్లికి మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ 25 x 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. ఇదే కక్ష్య నుంచి ఈ నెల 23న సాఫ్ట్ ల్యాండింగ్ చేపట్టనున్నది.
సాఫ్ట్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారం
అంతరిక్ష పరిశోధనల్లో దేశం సాధించిన పురోగతిని భారతీయులందరూ వీక్షించేలా ఇస్రో ప్రణాళికలు రచిస్తున్నది. జాబిల్లిపై ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యాన్ని అందరూ చూసేలా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. సాఫ్ట్ ల్యాండింగ్కు సంబంధించి సాయంత్రం 5.27 గంటల నుంచి లైవ్ను ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు ఆదివారం ఇస్రో వెల్లడించింది. ఇస్రో వెబ్సైట్, య్యూట్యూబ్ చానల్, ఫేస్బుక్ పేజీ, డీడీ నేషనల్ చానల్లో ఈ దృశ్యాలను వీక్షించవచ్చు. విద్యా సంస్థల్లో లైవ్స్ట్రీమింగ్ నిర్వహించాలని ఇస్రో పిలుపునిచ్చింది.
చంద్రుడిపై ప్రయోగాల్లో జయాపజయాలు
చంద్రుడిపై వివిధ దేశాలు చేపట్టిన ప్రయోగాలు
దశాబ్దాల వారీగా చేపట్టిన ప్రయోగాలు..