న్యూఢిల్లీ : మెరుగైన స్ర్కీన్ సైజ్, భారీ డిస్ప్లే, బ్యాటరీ సామర్ధ్యం, కండ్లు చెదిరే కెమెరాలు, 5జీ కనెక్టివిటీతో పాటు వేగవంతమైన పెర్పామెన్స్ కలిగిన లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు కోరుకుంటే బడ్జెట్లో కొంత రాజీపడాల్సిందే. రూ . 45,000లోపు ధరలో లేటెస్ట్ ఫీచర్లతో పాటు న్యూ జనరేషన్ చిప్సెట్లు, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ప్రీమియం ఫోన్లు అందుబాటులోకి వచ్చయి.
ఇక బడ్జెట్ పెరిగే కొద్దీ లేటెస్ట్ ఫీచర్లతో కూడిన ఫ్లాగ్షిప్ ఫోన్ల ఎంపిక సులభతరమవుతుంది. మార్కెట్లో ఖరీదైన స్మార్ట్ ఫోన్లు పలు బ్రాండ్లు ఎన్నో మోడల్స్తో సందడి చేస్తున్నా వీటిలో మెరుగైన ఎంపిక కస్టమర్లకు ఏమంత సులభం కాదు. వన్ప్లస్, షియోమి, ఒప్పో వంటి పలు స్మార్ట్పోన్ కంపెనీలు రూ .45,000 లోపు ధరలో పలు లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసినా అసలు ఏది మెరుగైనదే సందేహాలు కస్టమర్ల మదిని తొలిచేస్తుంటాయి. ఇక ఈ జనవరిలో భారత్లో రూ . 45,000లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లు ఇవేనని టెక్ నిపుఫులు సూచిస్తున్నారు.
వన్ప్లస్ 10 ఆర్ 5జీ : రూ . 35,000
ఒప్పో రెనో 8 ప్రో 5జీ : రూ. 45,999
షియామి 11టీ ప్రో 5జీ : రూ. 45,000
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ : రూ. 45,000