న్యూఢిల్లీ : లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభించే స్మార్ట్ఫోన్లకు డిమాండ్ మెరుగ్గా ఉన్నా ఈ సెగ్మెంట్లో సరైన ఫోన్ల ఎంపిక సులభం కాదు. డబ్బుకు తగిన విలువ అందించే స్మార్ట్ఫోన్ల కోసం కస్టమర్లు అన్వేషిస్తుంటారు. 5జీ కనెక్టివిటీతో పాటు భారీ డిస్ప్లే, బ్యాటరీ సామర్ధ్యం ఉన్న స్మార్ట్ఫోన్లు ఖరీదు ఎక్కువే అయినా అందుబాటు ధరలోనూ లేటెస్ట్ ఫీచర్లతో కూడిన డివైజ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ సెగ్మెంట్లో రూ .20,000లోపు స్మార్ట్ఫోన్లను ఎంచుకుంటే ప్రైస్, పెర్ఫామెన్స్ పరంగా రాజీపడని రీతిలో హాట్ డివైజ్లను సొంతం చేసుకోవచ్చు. అందుబాటు ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్ ఎంపిక చేసుకోవడమే తెలివైన ఛాయిస్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. లేటెస్ట్ ప్రాసెసర్తో పాటు మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం, డిస్ప్లే, కెమెరా ఫీచర్లను పరిశీలిస్తూ అందుబాటు ధరలో మెరుగైన స్మార్ట్ఫోన్ను ఎంచుకోవాలని చెబుతున్నారు. ఇక రూ .20,000లోపు బడ్జెట్లో ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్ల బేస్ మోడల్స్ ధరలను పరిశీలిస్తే..
పోకో ఎక్స్4 ప్రొ 5జీ : రూ. 17,999
రెడ్మి నోట్ 11 ప్రొ+ : రూ . 19,999
రియల్మి 10 ప్రొ : రూ . 18,999
వన్ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ : రూ . 20,000
మోటో జీ72 : రూ. 14,999