Apple Event | గత సంవత్సరం సెప్టెంబర్లో యాపిల్ సంస్థ.. ఐఫోన్ 13 సిరీస్ను లాంచ్ చేసింది. ఆ సిరీస్లో భాగంగా యాపిల్ ఐఫోన్ 13, 13 ప్రో, 13 మినీ, 13 ప్రో మ్యాక్స్ ఫోన్లను విడుదల చేసింది. ఆ తర్వాత మళ్లీ మంగళవారం(మార్చి 8) పీక్ పర్ఫార్మెన్స్ పేరుతో ఈవెంట్ను నిర్వహించనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 నిమిషాలకు ఈవెంట్ ప్రారంభం అవుతుంది.
ఈ ఈవెంట్లో ఐఫోన్ ఎస్ఈ3, న్యూ ఐపాడ్ ఎయిర్తో పాటు మ్యాక్బుక్ లాప్టాప్స్, మాక్ మినీ, మాక్ స్టూడియో, ఎం2 సిలికాన్ చిప్, మాక్ బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో మోడల్స్ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్లో జరిగే ఈవెంట్ను యాపిల్ యూట్యూబ్ చానెల్లో లైవ్గా వీక్షించవచ్చు. యాపిల్ టీవీ యాప్లో కూడా లైవ్ను వీక్షించవచ్చు. ఈ ఈవెంట్లో లాంచ్ కాబోయే ఐఫోన్ ఎస్ఈ3కి ఐఫోన్ ఎస్ఈ 2022గానూ పేరు పెట్టారు. 2020లో రిలీజ్ అయిన ఐఫోన్ ఎస్ఈకి కొనసాగింపుగా ఈ ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్ను 5జీ కనెక్టివిటీతో పాటు యాపిల్ ఏ15 బయోనిక్ ఎస్వోసీ, బెస్ట్ రేర్ కెమెరా ఆప్షన్తో తీసుకురానున్నారు. ఈ ఫోన్ను అతి తక్కువ ధరకే యాపిల్ అందించనున్నట్టు సమాచారం. 300 డాలర్లు అంటే రూ.23 వేల లోపే ఈ ఫోన్ను యాపిల్ సంస్థ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
దీనితో పాటు.. ఫిప్త్ జనరేషన్ ఐపాడ్ ఎయిర్ను ఈ ఈవెంట్లో యాపిల్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 5జీ కనెక్టివిటీతో పాటు యాపిల్ ఏ15 బయోనిక్ ఎస్వోసీ ప్రాసెసర్తో రానున్న ఐపాడ్ ఎయిర్ ధర రూ.46 వేల వరకు ఉండే అవకాశం ఉంది.
యాపిల్ ఎం2, ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్, ఎం1 మ్యాక్స్ ఎస్వోసీ పేరుతో సరికొత్త మాక్ మోడల్స్ను కూడా యాపిల్ రిలీజ్ చేయనుంది. ఎం2 చిప్సెట్తో మాక్బుక్ ప్రో, మాక్బుక్ ఎయిర్ లాప్టాప్స్ రానున్నాయి. ఎం1 ప్రో, ఎం1 మ్యాక్స్ వేరియంట్లలో ఐమాక్ ప్రో రానుంది. ఎం1, ఎం2 ప్రో ఎస్వోసీ ప్రాసెసర్తో మాక్ మినీ రానుంది.