ఐ ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్. యాపిల్ కంపెనీ త్వరలోనే ఎమర్జెన్సీ సాస్ అనే శాటిలైట్ టెక్స్టింగ్ ఫీచర్ని అందుబాటులోకి తీసుకురానుంది. అందుకోసం కోసం ఏకంగా 450 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది యాపిల్ కంపెనీ. ఐ ఫోన్ 14 మోడళ్లలో కొత్తగా శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ సాస్ కాల్ చేసుకునే ఫీచర్ని తీసుకురానుంది యాపిల్. అమెరికాకు చెందిన కంపెనీలతో కలిసి పని చేయనుంది. శాటిలైట్స్ని ఆపరేట్ చేసే గ్లోబల్ స్టార్ అనే కంపెనీకి యాపిల్ పెద్ద మొత్తం అప్పజెప్పనుంది. ఎమర్జెన్సీ సాస్ ఫీచర్ ఈ నెల తర్వాత అమెరికా, కెనడాలోని యూజర్లకు మొదటగా అందుబాటులోకి రానుంది.