ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో మరో కొత్తసేల్ను ప్రకటించింది. శాంసంగ్ అప్గ్రేడ్ డేస్ సేల్ 2021 పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది.సేల్లో భాగంగా ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు బడ్జెట్ శాంసంగ్ ఫోన్లను రాయితీ ధరలకు కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ ఎస్21 ప్లస్ 5జీ, గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఏ72, గెలాక్సీ ఎం51, వంటి ప్రీమియం ఫోన్లపై ఆఫర్ ప్రకటించింది. గెలాక్సీ ఏ12, గెలాక్సీ M02s, గెలాక్సీ ఏ32, గెలాక్సీ ఎం42 లాంటిబడ్జెట్ ఫోన్లపైనా డిస్కౌంట్ అందిస్తున్నది. స్మార్ట్ఫోన్ అప్గ్రేడ్ డేస్ మే 27తో ముగియనుంది. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్తో పాటు సిటీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది.